JAANAPADA KALAA CHAITANYA YAATRA ‘జానపద కళా చైతన్య యాత్ర‘
తాతా రమేష్ బాబు, కవి, రచయిత , చిత్రకారుడు, బొమ్మలాట ప్రయోక్త, రేడియో – టివి నటుడు, బహుగ్రంధ కర్త నిర్వహించిన ‘జానపద కళా చైతన్య యాత్ర‘ ది .07.08. 2012 నుండి 09. 08. 2012 వరకు 30 మంది జానపద కళాకారులు 10 మంది జానపద కళా పరిశోధకులు – అభిమానులతో , కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ‘తెలుగు జానపద కళా చైతన్య యాత్ర నిర్వహించి , యాత్రా విశేషాలు పరిశోధక వ్యాసాలతో “తెలుగు జానపద కళ” అనే పుస్తకాన్ని ప్రచురించారు . తెలుగు భాషకు సంస్కృతికి వేశేష సేవలందించి , భారత గ్రామీణ ప్రజలలో విజ్ఞాన వికాస వినోదాలను కలుగచేసి నేడు అవసానదశలో వున్న జానపద కళారూపాలను నేటి విద్యార్థుల – ప్రజల వద్దకు తీసుకెళ్ళి , వాటి ఔన్నత్యాన్ని తెలపాలని, మనోవికాసం పంచడం ద్వారా , తెలుగు భాషా – సంస్కృతులు పరిడవిల్లాలనేదే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం